AP: దవళేశ్వరం బ్యారేజీ వద్ద ఒకటో ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ
ABN, First Publish Date - 2021-07-26T13:25:15+05:30
దవళేశ్వరం బ్యారేజి గోదావరి వరద ఉధృతి తగ్గుముఖం పట్టడంతో అధికారులు ఒకటో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు.
రాజమండ్రి: దవళేశ్వరం బ్యారేజి గోదావరి వరద ఉధృతి తగ్గుముఖం పట్టడంతో అధికారులు ఒకటో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. ప్రస్తుతం బ్యారేజీ నీటిటమట్టం 11.50 అడుగుల వద్ద కొనసాగుతోంది. బ్యారేజీ 175 గేట్లు పూర్తిగా ఎత్తివేసి 9.56 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. మరోవైపు దేవీపట్నం మండలంలోనే దేవీపట్నం మండలంలోని 30 గ్రామాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. విలీన మండలాల్లోను రహదారులపై వరద నీరు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కోనసీమలోను కాజ్వేలపై వరద నీరు పొంగి ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. దీంతో ప్రజలు నాటుపడవల్లోనే రాకపోకలు సాగిస్తున్నారు.
Updated Date - 2021-07-26T13:25:15+05:30 IST