మూఢనమ్మకాల నిర్మూలనకు చట్టం చేయాలి
ABN, First Publish Date - 2021-10-18T05:27:45+05:30
మూఢనమ్మకాల నిర్మూలనకు ప్రభుత్వం తక్షణమే స్పందించి చట్టాన్ని ఏర్పాటు చేయాలని హేతువాద సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకట సుబ్బయ్య డిమాండ్ చేశారు.
రాజమహేంద్రవరం సిటీ, అక్టోబరు 17: మూఢనమ్మకాల నిర్మూలనకు ప్రభుత్వం తక్షణమే స్పందించి చట్టాన్ని ఏర్పాటు చేయాలని హేతువాద సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకట సుబ్బయ్య డిమాండ్ చేశారు. స్థానిక ప్రెస్క్లబ్లో ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విజ్ఞాన శాస్త్రం ఎంతగానో అభివృద్ధి చెందుతున్న తరుణంలో గ్రామాల్లో చేతబడులు, పూనకాలు, జంతుబలులు, క్షుద్ర పూజలు, పరలోకం పేరుతో ప్రజల ధన, మాన, ప్రాణాలను దోచుకుంటున్నారని ఆరోపించారు. దొంగ స్వాములు ఆశ్రమాల పేరుతో ప్రభుత్వ భూములను అక్రమించుకుని మోసం చేస్తున్నారన్నారు. ఇలాంటి తరుణంలో ప్రజలను చైతన్యవంతం చేయడం కోసం వెంటనే మూఢనమ్మకాల నిర్ములన చట్టం ఏర్పాటు చేయాలని, ప్రాథమిక స్థాయి నుంచి విద్యార్థులకు శాస్త్రీయమైన విద్యను అందించాలని, మతపరమైన పురాణాలను విద్యార్థులకు బోధించకూడదని వెంకట సుబ్బయ్య అన్నారు.
Updated Date - 2021-10-18T05:27:45+05:30 IST