బాలికల ఆశ్రమ పాఠశాలలో కలెక్టర్ హరికిరణ్
ABN, First Publish Date - 2021-10-25T05:57:38+05:30
ప్రతి ఉద్యోగి వారి విధులను నిబద్ధతతో నిర్వర్తించాలని కలెక్టర్ సీహెచ్ హరికిరణ్ చెప్పారు. చింతూరు మండలంలో ఆదివారం ఆయన పర్యటించారు.
చింతూరు, అక్టోబరు 24: ప్రతి ఉద్యోగి వారి విధులను నిబద్ధతతో నిర్వర్తించాలని కలెక్టర్ సీహెచ్ హరికిరణ్ చెప్పారు. చింతూరు మండలంలో ఆదివారం ఆయన పర్యటించారు. బాలికల ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. అక్కడి సౌకర్యాలను ఆయన నేరుగా పరిశీలించారు. చివరిగా కలెక్టర్ విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఆయన వెంట ఐటీడీఏ పీవో ఆకుల వెంకటరమణ, ఏఎస్పీ కృష్ణకాంత్ ఉన్నారు.
Updated Date - 2021-10-25T05:57:38+05:30 IST