ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజలను వంచిస్తున్న సీఎం జగన్‌: ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు

ABN, First Publish Date - 2021-08-02T16:27:03+05:30

ఎన్నికల్లో ప్రజలకు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మండపేట: ఎన్నికల్లో ప్రజలకు మెరుగైన పాలన అందిస్తామని గద్దెనెక్కిన సీఎం జగన్‌ పదవిలోకి వచ్చాక ప్రజలను వంచించడం, ప్రతిపక్షాలను అణగదొక్కడం చేస్తున్నారని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ధ్వజమెత్తారు. కపిలేశ్వరపురం మండల టీడీపీ సమావేశం పార్టీ మండల అధ్యక్షుడు ముత్యాల వెంకట్రావు అధ్యక్షతన మండపేట పార్టీ కార్యాలయంలో ఆదివారం జరిగింది. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇచ్చిన హామీలు పక్కన పెట్టి రెండేళ్లలో ప్రజలపై పన్నుల భారం పెంచారే తప్ప చేసిందేమీ లేదన్నారు. అందరికీ ఇళ్ల స్థలాల అందిస్తామన్న ప్రభుత్వం వైసీపీ సానుభూతిపరులకు మాత్రమే అందించిందన్నారు. రహదారులు అధ్వానంగా మారాయన్నారు. ధాన్యం సొమ్ముల చెల్లింపులో జాప్యంవల్ల రైతులు సాగు పెట్టుబడులకు డబ్బులు లేక అప్పలు తెచ్చుకుని వ్యవసాయం చేసుకుంటున్నారన్నారు. సమావేశంలో సర్పంచ్‌లుగా విజయం సాధించిన వారిని సత్కరించారు.  కాలేరు, నాగులచెరువు, అచ్యుతాపురం సర్పంచ్‌లు దాయం కావేరి, వాసంశెట్టి సుజాత, రెడ్డి సుజాతతోపాటు డీసీఎంఎస్‌ మాజీ చైర్మన్‌ రెడ్డిప్రసాద్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ నల్లమ్లిల వీర్రెడ్డి పాల్గొన్నారు.


Updated Date - 2021-08-02T16:27:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising