భవన నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలి
ABN, First Publish Date - 2021-06-20T05:05:03+05:30
పంచాయతీ సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు, వెల్నెస్ సెంటర్ల భవన నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని పంచాయతీ రాజ్ ఈఈ బీవీ రమణ అన్నారు.
రాజమహేంద్రవరం రూరల్, జూన్ 19: పంచాయతీ సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు, వెల్నెస్ సెంటర్ల భవన నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని పంచాయతీ రాజ్ ఈఈ బీవీ రమణ అన్నారు. రాజమహేంద్రవరం రూరల్ మండలం కాతేరులో నిర్మాణంలో ఉన్న సచివాలయ భవనాలను ఎంపీడీవో బి.రామారావు, డీఈఈ సూర్యనారాయణ, మండల ఇంజనీరింగ్ అధికారి సంపత్తో కలిసి పరిశీలించారు. నిర్మాణాల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ త్వరగా పూర్తి చేయాలని అధికారులకు, సచివాలయ సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో పంచాయతీ ఈవో హనుమంతరావు, ఆచంట కళ్యాణ్, ఎ.వాసు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-06-20T05:05:03+05:30 IST