రాష్ట్రంలో ఏ1, ఏ2 పాలన
ABN, First Publish Date - 2021-01-21T06:09:25+05:30
రాష్ట్రంలో ఏ1, ఏ2ల ఆధ్వర్యంలో పరిపాలన జరుగుతోందని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి విమర్శించారు.
ఎమ్మెల్యే బుచ్చయ్యచౌదరి
కాకినాడ క్రైం, జనవరి 20: రాష్ట్రంలో ఏ1, ఏ2ల ఆధ్వర్యంలో పరిపాలన జరుగుతోందని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి విమర్శించారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన కారణంగా రాజమహేంద్రవరం నియోజకవర్గానికి చెందిన టీడీపీ కార్యకర్తపై కేసు బనాయించి కాకినాడ సబ్ జైలులో ఉంచిన విషయం తెలిసిందే.. దీంతో బుధవారం ఎమ్మెల్యే గోరంట్ల, మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు బాధితుడిని పరామర్శించేందుకు వచ్చారు. కరోనా కారణంగా సబ్జైల్లో పరామర్శకు ఎవరికీ అనుమతి ఇవ్వడం లేదని జైలు అధికారి తెలపడంతో బయట కొద్దిసేపు వేచి ఉండి వెనుతిరిగారు. ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ వైసీపీ నాయకులు ర్యాలీలు, బహిరంగ సభలు ఏర్పాటు చేసుకోవడానికి కరోనా అడ్డంకిగా లేదని, ఇతర పార్టీల వారికి మాత్రం కరోనాను అడ్డంకిగా చూపుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మల్లిపూడి వీరు, ఎన్.విశ్వనాఽథం, దండుప్రోలు నాగబాబు, ఎండీ అజ్జు, బంగారు సత్యనారాయణ, ఎస్కే రహీమ్, గంగాధరం, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-01-21T06:09:25+05:30 IST