ఆర్టోస్ రెండో యూనిట్ ప్రారంభం
ABN, First Publish Date - 2021-04-14T06:14:43+05:30
ఉభయ గోదావరి జిల్లాల్లో పేరెన్నిక గల ఆర్టోస్ డ్రింక్స్కి ప్రజాదరణ పెరగడంతో రెండో యూనిట్ను ఉగాది పర్వదినం సందర్భంగా మంగళవారం ఉదయం ప్రారంభించారు
రామచంద్రపురం, ఏప్రిల్ 13: ఉభయ గోదావరి జిల్లాల్లో పేరెన్నిక గల ఆర్టోస్ డ్రింక్స్కి ప్రజాదరణ పెరగడంతో రెండో యూనిట్ను ఉగాది పర్వదినం సందర్భంగా మంగళవారం ఉదయం ప్రారంభించారు. భవనాన్ని పట్టణ ప్రముఖుడు డాక్టర్ చెలికాని స్టాలిన్, మిక్సింగ్ యూనిట్ను మంత్రి చెల్లుబోయిన వేణు తనయుడు నరేన్, ప్రొడక్షన్ యూనిట్ను ఆడిటర్ రవీంద్రవర్మ, ఆర్టోస్ కార్యాలయాన్ని మునిసిపల్ చైర్మన్ గాదంశెట్టి శ్రీదేవి ప్రారంభించారు. మేనేజింగ్ డైరెక్టర్ అడ్డూరి జగన్నాఽథవర్మ మాట్లాడుతూ 1.25 లీటరు, 2.5 లీటరు, 200 మి.లీల్లో గ్రేప్, లెమన్, ఆరెంజ్ రుచుల్లో అంది స్తామని తెలిపారు. కార్యక్రమంలో అడ్డూరి వీరభద్రరాజు, డాక్టర్ చెలికాని రామారావు, వైసీపీ పట్టణ కన్వీనర్ గాదంశెట్టి శ్రీధర్, మునిసిపల్ వైస్ చైర్మన్ కట్టా నాగేశ్వరరావు, కౌన్సిలర్లు వాడ్రేవు సాయిప్రసాద్, కుడుపూడి లలితాగణేష్, చింతపల్లి నాగేశ్వరరావు, కొండేపూడి సురేష్, మేడిశెట్టి శేషారావు, కోటి శ్రీకన్యకనకదుర్గారావు, నాయకులు కనకాల వెంకటేశ్వరరావు, అంపోలు సత్యనారాయణ, చెల్లుబోయిన జయప్రకాష్, సూరంపూడి సుబ్రహ్మణ్యం, తొగరు మూర్తి, కంచి సత్యానందం, శీలం గంగరాజు పాల్గొన్నారు.
Updated Date - 2021-04-14T06:14:43+05:30 IST