భవనం పైనుంచి పడి కార్మికుడి మృతి
ABN, First Publish Date - 2021-02-25T06:52:08+05:30
భవనంపై ఉన్న పిల్ల్లర్లను తొలగిస్తున్న సమయంలో అదుపుతప్పి ఓ భవన నిర్మాణ కార్మికుడు అక్కడికక్కడే మృతిచెందాడు.
అంబాజీపేట, ఫిబ్రవరి 24: భవనంపై ఉన్న పిల్ల్లర్లను తొలగిస్తున్న సమయంలో అదుపుతప్పి ఓ భవన నిర్మాణ కార్మికుడు అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కె.పెదపూడి పరిధిలోని నెల్లివారిపేటకు చెందిన కోట శ్రీనివాసరావు తన బిల్డింగ్ పైభాగంలో ఉన్న పిల్లర్లను తొలగించడానికి మోడేకుర్రుకు చెందిన తాపీమేస్ర్తీ గిరిగి కృష్ణ(52)కు కాంట్రాక్ట్ ఇచ్చాడు. పిల్లర్లను తొలగిస్తున్న సమయంలో కృష్ణ అదుపుతప్పి క్రిందకు పడిపోవడంతో తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. అతడికి భార్య, కుమా రుడు, కుమార్తె ఉన్నారు. ఈసంఘటనపై పోలీసులకు ఏవిధమైన ఫిర్యాదు అందలేదు.
Updated Date - 2021-02-25T06:52:08+05:30 IST