ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కూతురు కాపురం సజావుగా లేదని తండ్రి మృతి

ABN, First Publish Date - 2021-10-28T06:19:18+05:30

తన కుమార్తె కాపురం సజావుగా లేకపోవడంతో మనస్తాపం చెందిన తండ్రి తనువు చాలించాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనుమానాస్పద మృతిగా కేసు నమోదు

ద్రాక్షారామ, అక్టోబరు 27: తన కుమార్తె కాపురం సజావుగా లేకపోవడంతో మనస్తాపం చెందిన తండ్రి తనువు చాలించాడు. కర్రి వారి వీధికి చెందిన తలపాగల శ్రీనివాసరావు(61) తన కుమార్తె ఈశామాలినికి ఏలూరుకు చెందిన కారుపర్తి గౌతమ్‌ కుమార్‌తో 2020లో వివాహం జరిపించాడు. మరుసటి రోజు నుంచే వారి కాపురంలో కలతలు మొదలయ్యాయి. దీంతో ఆమె పుట్టింట్లోనే ఉంటోంది. కుమార్తె జీవితం పాడైందని శ్రీనివాసరావు మనో వ్యధకు గురై బుధవారం ఒక్కసారిగా కుప్పకూలి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. అతడిని ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నిస్తుండగా మృతి చెందాడు. కాగా తనకు అనారోగ్యంగా ఉందని తండ్రి చెప్పినట్టు కుమార్తె ఈశామాలిని తెలుపుతూ మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో శ్రీనివాసరావు మృతదేహాన్ని రామచంద్రపురం ఏరియా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. ఎస్‌ఐ తులసీరామ్‌ అనుమానాస్పద మృతిగా కేసు దర్యాప్తు చేస్తున్నారు.  మరోవైపు శ్రీనివాసరావు ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని భావిస్తున్నారు. 



Updated Date - 2021-10-28T06:19:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising