దసరాలో అమ్మవారిని దర్శించుకోవడం నా భాగ్యం: జీవీఎల్
ABN, First Publish Date - 2021-10-10T00:20:37+05:30
దసరాలో అమ్మవారిని దర్శించుకోవడం తన భాగ్యమని బీజీపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు వ్యాఖ్యానించారు. దసరా ఉత్సవాల్లో భాగంగా
విజయవాడ: దసరాలో అమ్మవారిని దర్శించుకోవడం తన భాగ్యమని బీజీపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు వ్యాఖ్యానించారు. దసరా ఉత్సవాల్లో భాగంగా ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను నరసింహారావు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కొవిడ్ ఉన్న సమయంలో అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కరోనా మహమ్మారి నుంచి ప్రజలను రక్షించాలని అమ్మవారిని వేడుకున్నానని తెలిపారు. జగన్మాత కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు వేలాదిగా తరలివస్తున్న భక్తజనంతో ఇంద్రకీలాద్రి పులకిస్తోంది. గుండెలనిండా భక్తిభావాన్ని నింపుకుని అమ్మవారి నామాన్ని జపిస్తూ భక్తులు జగన్మాతను దర్శించుకుంటున్నారు.
Updated Date - 2021-10-10T00:20:37+05:30 IST