వైసీపీకి రోజులు దగ్గర పడ్డాయి
ABN, First Publish Date - 2021-03-01T08:53:22+05:30
ఓట్లు వేసిన ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న వైసీపీని ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గర పడ్డాయని టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు.
బాధితులపైనే కేసులా?: అనిత
అనపర్తి, ఫిబ్రవరి 28: ఓట్లు వేసిన ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న వైసీపీని ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గర పడ్డాయని టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో వైసీపీ నేతల దాడిలో గాయపడ్డ బాధితులను ఆదివారం పరామర్శించారు. ఈనెల 13న బిక్కవోలు మండలం ఇళ్ళపల్లి లో కన్నూరి రాఘవ, ఆయన కుమారుడు, ఇద్దరు కమార్తెలపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. పోలీసులు బాధితులపైనే కేసులు నమోదు చేశారు. అనపర్తిలో లంక గంగాధరం అనే టీడీపీ కార్యకర్తను కొట్టారు. తిరిగి కేసు పెట్టారు. బాధితులను టీడీపీ నేతలు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, వంగలపూడి అనిత, పీతల సుజాత, గొల్లపల్లి సూర్యారావు పరామర్శించారు. బాధితులకు పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. ఇళ్లపల్లిలో బాలింతపై అనుచితంగా ప్రవర్తించిన ఎస్ఐపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలన్నారు.
Updated Date - 2021-03-01T08:53:22+05:30 IST