శ్రీకాకుళం జిల్లాకు వైద్య పరికరాలు ఇవ్వండి
ABN, First Publish Date - 2021-05-09T08:39:46+05:30
శ్రీకాకుళం జిల్లాలో ఉగ్రరూపం దాల్చిన కరోనా మహమ్మారి నేపథ్యంలో బాధితుల ఆరోగ్య భద్రతను పరిగణనలోకి తీసకుని ‘పీఎం కేర్స్‘ పథకం ద్వారా అత్యవసర వైద్య పరికారాలను సమకూర్చాలని టీడీపీ ఎంపీ కింజరాపు
ప్రధానికి టీడీపీ ఎంపీ రామ్మోహన్నాయుడు వినతి
న్యూఢిల్లీ, మే8(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం జిల్లాలో ఉగ్రరూపం దాల్చిన కరోనా మహమ్మారి నేపథ్యంలో బాధితుల ఆరోగ్య భద్రతను పరిగణనలోకి తీసకుని ‘పీఎం కేర్స్‘ పథకం ద్వారా అత్యవసర వైద్య పరికారాలను సమకూర్చాలని టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీకి రాసిన లేఖను శనివారం ఇక్కడ మీడియాకు విడుదల చేశారు. 30 వెంటిలేటర్లు, 100 ఆక్సిజన్ యూనిట్లు శ్రీకాకుళం జిల్లాకు కేటాయించి, కరోనా బాధితులను ఆదుకోవాలని రామ్మోహన్ విజ్ఞప్తి చేశారు.
Updated Date - 2021-05-09T08:39:46+05:30 IST