చిట్టూరి ప్రభాకర చౌదరి కన్నుమూత
ABN, First Publish Date - 2021-05-03T10:03:00+05:30
కమ్యూనిస్టు సీనియర్ నాయకుడు, స్వాతంత్య్ర సమరయోధుడు, తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం మాజీ ఎమ్మెల్యే చిట్టూరి ప్రభాకర
రాజమహేంద్రవరం అర్బన్, హైదరాబాద్, మే 2(ఆంధ్రజ్యోతి): కమ్యూనిస్టు సీనియర్ నాయకుడు, స్వాతంత్య్ర సమరయోధుడు, తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం మాజీ ఎమ్మెల్యే చిట్టూరి ప్రభాకర చౌదరి(98) ఆదివారం కన్నుమూశారు. కొద్దిరోజుల క్రితం స్వల్ప అస్వస్థతకు గురైన ఆయన ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. ఆయన భార్య సుశీల గతంలోనే మృతి చెందారు. ప్రభాకర చౌదరికి ఇద్దరు కుమారులు, నలుగురు కుమార్తెలు. ఆయన మృతికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తదితరులు సంతాపం తెలిపారు. రాజమండ్రి గాంధీగా ప్రసిద్ధికెక్కిన చిట్టూరి ప్రభాకర్ చౌదరి మరణానికి సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ సంతాపం తెలిపారు. ఆనాడే దళిత మహిళను మనువాడిన మహనీయుడన్నారు. ‘నేను నూరేండ్లు బతుకుతానొయ్’ అన్న తన మాటలను నిలబెట్టుకోకుండానే చిట్టూరి మరణించడం బాధాకరమన్నారు. ఆదివారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో సీపీఐ జాతీయ సమితి తరుఫున ప్రగాఢ సంతాపం తెలియజేశారు.
Updated Date - 2021-05-03T10:03:00+05:30 IST