డీజీపీ వ్యాఖ్యలపై వెలగపూడి ఫైర్
ABN, First Publish Date - 2021-01-16T19:04:06+05:30
రాష్ట్రంలో ఆలయాలపై వరుసగా జరుగుతున్న దాడుల వెనుక టీడీపీ, బీజేపీ ఉందన్న డీజీపీ గౌతమ్ సవాంగ్ వ్యాఖ్యలపై ..
విశాఖ: డీజీపీ గౌతమ్ సవాంగ్ వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆలయాలపై వరుసగా జరుగుతున్న దాడుల వెనుక టీడీపీ, బీజేపీ ఉందని ఎలా చెబుతారని ప్రశ్నించారు. డీజీపీ స్థాయి వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. డీజీపీ వ్యాఖ్యలు పోలీస్ వ్యవస్థకు మచ్చగా పేర్కొన్నారు. సీఎం జగన్ నిర్లక్ష్యం వల్లే ఈ దాడులు జరుగుతున్నాయన్నారు. పోలీసులకు చిత్తశుద్ధి ఉంటే నిందితులను వెంటనే అరెస్టు చేయాలని వెలగపూడి రామకృష్ణ డిమాండ్ చేశారు.
Updated Date - 2021-01-16T19:04:06+05:30 IST