కృష్ణానది తీరంలో అత్యాచార ఘటనపై స్పందించిన డీజీపీ
ABN, First Publish Date - 2021-06-21T18:14:34+05:30
కృష్ణానది తీరంలో అత్యాచార ఘటనపై డీజీపీ సవాంగ్ స్పందించారు. ఇలాంటి అమానవీయ చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ
విజయవాడ: కృష్ణానది తీరంలో అత్యాచార ఘటనపై డీజీపీ సవాంగ్ స్పందించారు. ఇలాంటి అమానవీయ చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదన్నారు. నిందితులను పట్టుకోవాలని విజయవాడ సీపీ, కృష్ణా, గుంటూరు ఎస్పీలను ఆదేశించామన్నారు. నిందితులు ఎంతటివారైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారు. ప్రతి మహిళ దిశ యాప్ను ఖచ్చితంగా వాడేలా చర్యలు తీసుకుంటామని డీజీపీ సవాంగ్ వెల్లడించారు.
Updated Date - 2021-06-21T18:14:34+05:30 IST