భక్తుల్లో అపోహలు కల్పించవద్దు: టీటీడీ
ABN, First Publish Date - 2021-11-25T02:30:21+05:30
చిత్తూరుజిల్లా రామచంద్రాపురం మండలంలోని రాయలచెరువు ప్రమాదకర పరిస్థితిలో ఉందంటూ ఓ ఆంగ్ల పత్రిక రాసిన కథనానికి తిరుమల శ్రీవారి ఆలయం ఫొటో
తిరుమల: చిత్తూరుజిల్లా రామచంద్రాపురం మండలంలోని రాయలచెరువు ప్రమాదకర పరిస్థితిలో ఉందంటూ ఓ ఆంగ్ల పత్రిక రాసిన కథనానికి తిరుమల శ్రీవారి ఆలయం ఫొటో జత చేయడం సరైంది కాదని టీటీడీ బుధవారం ఓ ప్రకటన ద్వారా విజ్ఞప్తి చేసింది. ఈ కథనానికి, ఫొటోకు ఎలాంటి సంబంధం లేదని, ఇలాంటి ఫొటోలు ప్రచురించి భక్తుల్లో అపోహలు రేకెత్తించవద్దని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. అలాగే సోషల్ మీడియాలో కూడా ఈ విషయంపై జరిగిన ప్రచారం కూడా వాస్తవం కాదని, తిరుమలలో భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వామివారి దర్శనం చేసుకొనే పరిస్థితి ఉందని టీటీడీ స్పష్టం చేసింది.
Updated Date - 2021-11-25T02:30:21+05:30 IST