హుద్హుద్ తుఫాన్ సమయంలో కంటే..: దేవినేని ఉమ
ABN, First Publish Date - 2021-11-28T01:12:25+05:30
హుద్హుద్ తుఫాన్ సమయంలో కంటే..: దేవినేని ఉమ
నెల్లూరు: ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మాజీ మంత్రి దేవినేని ఉమా అన్నారు. హుద్హుద్ తుఫాన్ సమయంలో కంటే ఇప్పుడు ఎక్కువ ఉపద్రవాలను ఎదుర్కొంటున్నామన్నారు. తమ ప్రభుత్వంలో 65 ప్రాజెక్టులు మొదలుపెట్టామని, 25 నిర్మించి అప్పగించామన్నారు. అవన్నీ గాలికి వదిలేశారని ఆయన మండిపడ్డారు. ప్రజల ప్రాణాలు పోగొట్టారు, ఇది మానవ తప్పిదమా.. లేక ప్రభుత్వం చేసిన హత్యలా? అని దేవినేని ఉమా ప్రశ్నించారు.
Updated Date - 2021-11-28T01:12:25+05:30 IST