నన్ను చంపే ప్రయత్నం చేసినా చివరి వరకు పోరాడతా: దేవినేని
ABN, First Publish Date - 2021-04-13T00:26:34+05:30
నన్ను చంపే ప్రయత్నం చేసినా చివరి వరకు పోరాడతా: దేవినేని
నెల్లూరు: కేంద్ర జలవనరుల శాఖ అధికారులు ఏపీ ప్రయోజనాలకి విఘాతం కలిగే నిర్ణయాలు జరిపితే సీఎం జగన్, మంత్రులు మాట్లాడరని మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. కృష్ణా జలాలపై మాట్లాడకుంటే చరిత్రహీనులుగా మిగిలిపోతారని ఆయన వ్యాఖ్యానించారు. మంత్రి అనిల్ కుమార్ ఏపీ రైతులకి ద్రోహం చేసే విధంగా వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు. కృష్ణా జలాలపై ప్రశ్నిస్తున్నానని తనపై సీఐడీ కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకున్న సెక్యూరిటీని తొలగించి, తనను చంపే ప్రయత్నం చేసినా, చివరి రక్తం బొట్టు వరకు పోరాడతానని చెప్పారు. సీఎం స్వార్ధప్రయోజనాల కోసం, సీఎం కుర్చీలో కూర్చొనేదానికి డబ్బులకి కక్కుర్తిపడి రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెడుతున్నారని దేవినేని ఉమ
Updated Date - 2021-04-13T00:26:34+05:30 IST