మరో రైతాంగ ఉద్యమం: సీపీఐ రామకృష్ణ
ABN, First Publish Date - 2021-12-26T01:59:20+05:30
దేశంలో సాగు చట్టాలను మళ్లీ తీసుకొస్తే మరో రైతాంగ
అమరావతి: దేశంలో సాగు చట్టాలను మళ్లీ తీసుకొస్తే మరో రైతాంగ ఉద్యమం తప్పదని కేంద్ర ప్రభుత్వాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హెచ్చరించారు. ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. సాగు చట్టాలు మళ్లీ తీసుకువస్తామని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి తోమర్ వ్యాఖ్యానించడాన్ని ఆయన ఖండించారు. మోదీ హయాంలోనే రైతులకు మేలు జరిగితే ఢిల్లీలో చారిత్రాత్మక రైతాంగ ఉద్యమం ఎందుకు జరిగిందని ప్రశ్నించారు. దేశంలో 750 మంది రైతుల మృతికి కేంద్రమే కారణమని ఆయన ఆరోపించారు.
Updated Date - 2021-12-26T01:59:20+05:30 IST