ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజకీయ సంకుచితత్వంతోనే విమర్శలు: నారాయణ

ABN, First Publish Date - 2021-07-10T03:18:07+05:30

కేవలం రాజకీయ సంకుచితత్వం, ఓర్వలేని తనంతోనే వైసీపీ నేతలు వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయనగరం: కేవలం రాజకీయ సంకుచితత్వం, ఓర్వలేని తనంతోనే వైసీపీ నేతలు వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారని సీపీఐ జాతీయ  కార్యదర్శి కె.నారాయణ అన్నారు. పట్టణంలో అశోక్ గజపతిరాజును కె.నారాయణ మర్యాద పూర్వకంగా కలిసారు. అశోక్ గజపతిరాజును దొంగ అని అనడం 2021 లోనే పెద్ద జోకని ఆయన అభిప్రాయపడ్డారు. రాజకీయ విబేదాలు ఉండవచ్చు గాని, వ్యక్తిత్వం చూడాలన్నారు. ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి వెల్లంపల్లిలు వాడిన భాష సభ్యసమాజం తలదించుకునేలా ఉందన్నారు. కేవలం రాజకీయ సంకుచితత్వం, ఓర్వలేని తనంతోనే వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. నైతిక విలువ లేకుండా రాజకీయాలు చేయడం తగదన్నారు. సీఎం జగన్ ఇటువంటి వాటిని నియంత్రణలో పెట్టాలన్నారు. అశోక్ పై చేసిన వ్యాఖ్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు నారాయణ పేర్కొన్నారు. 

Updated Date - 2021-07-10T03:18:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising