చెరుకు రైతులపై అక్రమ కేసులు పెట్టడాన్ని ఖండిస్తున్నాం: Ramakrishna
ABN, First Publish Date - 2021-11-05T13:26:21+05:30
జిల్లాలోని లచ్చయ్యపేటలో చెరకు రైతులపై అక్రమ కేసులు పెట్టడాన్ని ఖండిస్తున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు.
విజయనగరం: జిల్లాలోని లచ్చయ్యపేటలో చెరకు రైతులపై అక్రమ కేసులు పెట్టడాన్ని ఖండిస్తున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. బకాయిలు చెల్లించాలని కోరిన చెరుకు రైతులపై అక్రమ కేసులు పెట్టడం దుర్మార్గమని మండిపడ్డారు. గతంలో అమరావతి రైతులపై కూడా ఎస్సీ, ఎస్టీ అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపారన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలు మితిమీరుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత రెండేళ్లుగా అమరావతి రైతుల నిరసన సెగలు భగ్గుమంటున్నాయని తెలిపారు. తక్షణమే విజయనగరం జిల్లా చెరకు రైతులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని... చెరకు రైతులకు బకాయిలను తక్షణమే చెల్లించాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.
Updated Date - 2021-11-05T13:26:21+05:30 IST