ముఖ్యమంత్రులే మాట తప్పుతున్నారు
ABN, First Publish Date - 2021-08-29T01:56:04+05:30
తెలుగు రాష్ట్రాలను పాలస్తున్న ముఖ్యమంత్రులే ఇచ్చిన మాటను తప్పుతున్నారని
చిత్తూరు: తెలుగు రాష్ట్రాలను పాలస్తున్న ముఖ్యమంత్రులే ఇచ్చిన మాటను తప్పుతున్నారని సీపీఐ నాయకుడు నారాయణ అన్నారు. మరి అటువంటుపుడు రైతులుగా మాట తప్పడంలో ఎలాంటి తప్పిదం లేదన్నారు. అందుకే రైతులుగా ఇదివరకే అంగీకార పత్రాలపై చేసిన సంతకాలపై మాట తప్పామని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రైతులకు ఆయన మద్దతు తెలిపారు. ఫైనల్గా రైతుల అంగీకార సంతకాలు ఉంటేనే ప్రభుత్వం భూములను తీసుకునే అవకాశం ఉందన్నారు. కాబట్టి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తెలంగాణలో దళితులను ముఖ్యమంత్రిని చేస్తానని కేసీఆర్ మాట తప్పారని ఆయన విమర్శించారు. అలాగే ఏపీలో అమరావతి రాజధానికి కట్టుబడి ఉండానననే మాటను జగన్ మోహన్ రెడ్డి తప్పారని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రులే మాట తప్పుతున్నప్పుడు. రైతులుగా మనం మాట తప్పడంలో తప్పులేదని నారాయణ అన్నారు.
Updated Date - 2021-08-29T01:56:04+05:30 IST