పత్తి ధర పతనం... క్వింటాకు వెయ్యి తగ్గుదల
ABN, First Publish Date - 2021-05-15T09:46:06+05:30
పత్తి ధర మళ్లీ పతనమైంది. నెలరోజుల వ్యవధిలో క్వింటాకు రూ.1000 తగ్గిపోయింది. ఆదోని మార్కెట్లో గత నెలలో క్వింటా గరిష్ఠంగా రూ.7,300 దాకా పలికిన ధర ఇప్పుడు రూ.6 వేలకు పడిపోయింది.
అమరావతి, మే 14 (ఆంధ్రజ్యోతి): పత్తి ధర మళ్లీ పతనమైంది. నెలరోజుల వ్యవధిలో క్వింటాకు రూ.1000 తగ్గిపోయింది. ఆదోని మార్కెట్లో గత నెలలో క్వింటా గరిష్ఠంగా రూ.7,300 దాకా పలికిన ధర ఇప్పుడు రూ.6 వేలకు పడిపోయింది. కనిష్ఠ ధర రూ.4 వేలకు దిగిపోయింది. కేంద్రం మద్దతు ధర రూ.5,825గా ప్రకటించగా, ప్రస్తుతం నాణ్యమైన సరుకుకు కూడా మార్కెట్లో లభించడం లేదు.
Updated Date - 2021-05-15T09:46:06+05:30 IST