ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అనంతపురం జిల్లాలో కరోనా కలకలం

ABN, First Publish Date - 2021-03-22T01:12:22+05:30

జిల్లాలో మళ్లీ కరోనా పంజా విసురుతోంది. గడిచిన 24 గంటల్లో 40 మందికి కరోనా సోకింది. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: జిల్లాలో మళ్లీ కరోనా పంజా విసురుతోంది. గడిచిన 24 గంటల్లో 40 మందికి కరోనా సోకింది. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా 135 యాక్టివ్ కేసులున్నట్లు అధికారులు తెలిపారు. లాక్‌డౌన్ ఎత్తేసిన తర్వాత ఒక్క రోజే 40 కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి. కరోనా నిర్ధారణ అయిన ప్రాంతాల్లో కూడా చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. పాఠశాలల్లో విద్యార్థుల సందడి సాగుతోంది. పిల్లలు కరోనా నియంత్రణ, నిబంధనలు పాటించడం లేదు. ప్రభుత్వం కూడా ఆ మేరకు అవసరమైన నిధులు, మెటీరియల్‌ ఇవ్వడం లేదని పలువురు చెబుతున్నారు. దీంతో కరోనా వైరస్‌ వేగంగా మళ్లీ ప్రభావం చూపుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. మూడు నెలలుగా కరోనా ప్రభావం తగ్గినట్లు కనిపించినా ఇప్పుడు మళ్లీ విజృంభిస్తోంది. రోజు వారీ కేసులు పెరుగుతున్నాయి. దీంతో మళ్లీ జనంలో టెన్షన్‌ మొదలైంది. స్వీయరక్షణతోనే కరోనాను దూరం చేయవచ్చన్న అభిప్రాయాలున్నాయి. తప్పనిసరిగా మాస్కులు ధరించటం, అత్యవసర పనులు ఉంటేనే బయట తిరగటం చేయాలని వైద్యులు చెబుతున్నారు.

Updated Date - 2021-03-22T01:12:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising