ఏపీలో కొత్తగా 3,263 కరోనా కేసులు నమోదు
ABN, First Publish Date - 2021-04-12T23:52:52+05:30
ఏపీలో కొత్తగా 3,263 కరోనా కేసులు నమోదు
అమరావతి: ఏపీలో కొత్తగా ఇవాళ 3,263 కరోనా కేసులు నమోదు కాగా, వైరస్తో 11 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 9,28, 664 కరోనా కేసులు నమోదు కాగా, వైరస్తో 7,311 మంది మరణించారు. అలాగే రాష్ట్రంలో 8,98,238 మంది రికవరీ అయ్యారు. 23,115 యాక్టివ్ కేసులు ఉన్నాయి. చిత్తూరు జిల్లాలో ఐదుగురు, నెల్లూరు జిల్లాలో ఇద్దరు మృతి చెందారు. అలాగే అనంతపురం, కడప, కర్నూలు, విశాఖ జిల్లాల్లో ఒక్కరు చొప్పున మృతి చెందారు.
Updated Date - 2021-04-12T23:52:52+05:30 IST