రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి
ABN, First Publish Date - 2021-10-12T01:59:43+05:30
జిల్లాలోని నందివాడ మండలంలో విషాద ఘటన చోటు చేసుకుంది. పుట్టగుంట శివారు జరిగిన రోడ్డు ప్రమాదంలో...
కృష్ణా: జిల్లాలోని నందివాడ మండలంలో విషాద ఘటన చోటు చేసుకుంది. పుట్టగుంట శివారు జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ సిటీ కానిస్టేబుల్ పోలుకొండ వెంకటేశ్వర రావు(50) మృతి చెందాడు. తన స్వగ్రామమైన గుడ్లవల్లేరు మండలం అంగలూరు నుండి బాపులపాడు మండలం,అరుగొలను వెళుతుండగా ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. తీవ్రగాయాలతో రోడ్డు పక్కన పడి ఉన్న కానిస్టేబుల్ను చికిత్స నిమ్మిత్తం గుడివాడ ప్రభుత్వ ఏరియా హాస్పటల్కు తరలించారు. చికిత్స పొందుతూ కానిస్టేబుల్ మృతి చెందాడు.
Updated Date - 2021-10-12T01:59:43+05:30 IST