ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శాసనసభలో పచ్చి బూతులా?: సాకే శైలజానాథ్

ABN, First Publish Date - 2021-11-20T22:35:51+05:30

ప్రజా సమస్యలు పరిష్కరించాల్సిన నిండు శాసన సభలో పచ్చి బూతులా? అని పీసీసీ చీఫ్ సాకే శైలజానాథ్ అన్నారు. ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటనను ఆయన...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ప్రజా సమస్యలు పరిష్కరించాల్సిన నిండు శాసన సభలో పచ్చి బూతులా? అని పీసీసీ చీఫ్ సాకే శైలజానాథ్ అన్నారు. ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటనను ఆయన ఖండించారు. చంద్రబాబు కుటుంబ సభ్యులపై వైసీపీ నేతలు వ్యాఖ్యలు తగవన్నారు. వాక్‌ స్వాతంత్ర్య హక్కును ఉపయోగించుకుని నోటికొచ్చినట్లు మాట్లాడటం సరికాదని సూచించారు. ఓ గొప్ప ప్రదేశంలో రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తి గురించి, అదీ వ్యక్తిగతంగా మాట్లాడటం అనేది బాధాకరమన్నారు. 


‘‘రాజకీయ విమర్శలు విధానాలపై ఉండాలి కానీ కుటుంబ సభ్యులను అందులోకి లాగి అసభ్యంగా మాట్లాడటం క్షమార్హం కాదు. శిశుపాలుడి వంద తప్పులు పూర్తయ్యాయి. ఇక అరాచకాన్ని ఉపేక్షించేది లేదు. ప్రజలు దుశ్యాసనుల భరతం పడతారు. ఈ పరిణామాలపై ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి.’’ అని  శైలజానాథ్ అన్నారు. 


Updated Date - 2021-11-20T22:35:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising