ప్రభుత్వ ఆస్తులమ్మి ప్రజలను బిచ్చగాళ్ళను చేస్తున్నారు: శైలజానాథ్
ABN, First Publish Date - 2021-11-19T01:30:20+05:30
నంద్యాల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు నగర్ నుంచి గాంధీ చౌక్ వరకు జన జాగరణ యాత్ర నిర్వహించారు. ఈ యాత్రలో పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా..
కర్నూలు: నంద్యాల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు నగర్ నుంచి గాంధీ చౌక్ వరకు జన జాగరణ యాత్ర నిర్వహించారు. ఈ యాత్రలో పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘రాష్ట్రంలో జగన్, కేంద్రంలో నరేంద్రమోదీ ప్రజలను భయబ్రాంతులకు గురి చేసి పరిపాలన చేస్తున్నారు. ప్రజలను కేంద్ర ప్రభుత్వం లూటి చేస్తోంది. ప్రభుత్వ ఆస్తులను అమ్మి పెట్రోల్, డీజల్ రేట్లను పెంచి ప్రజలను బిచ్చగాళ్ళను చేస్తున్నారు.’’ అని మండిపడ్డారు.
Updated Date - 2021-11-19T01:30:20+05:30 IST