ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇసుక పోసి.. శాపనార్థాలు!

ABN, First Publish Date - 2021-08-06T09:17:15+05:30

విశాఖపట్నం జిల్లా దేవదాయ శాఖలో అధికారుల మధ్య విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఇక్కడ డిప్యూటీ కమిషనర్‌ (డీసీ) పుష్పవర్థన్‌కు, అసిస్టెంట్‌ కమిషనర్‌ (ఏసీ)

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దేవదాయ శాఖ ఏసీ గీడీసీ 


విశాఖపట్నం, ఆగస్టు 5(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం జిల్లా దేవదాయ శాఖలో అధికారుల మధ్య విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఇక్కడ డిప్యూటీ కమిషనర్‌ (డీసీ) పుష్పవర్థన్‌కు, అసిస్టెంట్‌ కమిషనర్‌ (ఏసీ) శాంతికి కొద్దికాలంగా పొసగడం లేదు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం డీసీ తన కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశంలో ఉండగా.. ఏసీ శాంతి హఠాత్తుగా చాంబర్‌లోకి ప్రవేశించి, చేతితో తెచ్చిన ఇసుకను ఆయన ముఖంపై విసిరి దుర్భాషలాడారు. ఆయన తనను వేధిస్తున్నారని ఆరోపించారు.ఈ హఠాత్పరిణామానికి డీసీతో సహా అక్కడున్న అధికారులంతా విస్తుపోయారు. దీనిపై డీసీ పుష్పవర్థన్‌ మాట్లాడుతూ.. తాను డీసీగా బాధ్యతలు చేపట్టి నెల రోజులే అయిందని, గత నెల 14 తర్వాత గురువారమే మళ్లీ ఆఫీ్‌సకు వచ్చానని వివరించారు. ఆమెకు, తనకు ఎటువంటి విభేదాలు లేవన్నారు. 

Updated Date - 2021-08-06T09:17:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising