ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎమ్మెల్యే విడదల రజనీపై ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు‌లు

ABN, First Publish Date - 2021-08-24T20:59:26+05:30

చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీపై ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు‌: చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీపై ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. మంగళవారం ఎడవల్లి సొసైటీ రైతులు ఎస్సీ కమిషన్ బృందాన్ని కలిసి సమస్యలను విన్నవించారు. గ్రానైట్ కోసం తమ భూములను ప్రభుత్వం తీసుకుంటోందని రైతులు ఫిర్యాదు చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే రజనీ న్యాయం చేస్తామని చెప్పారని, అధికారంలోకి వచ్చాక మాట తప్పారన్నారు. తమ భూములు తమకే ఉండేలా చూడాలని ఎస్సీ కమిషన్‌ను రైతులు కోరారు. మైనింగ్ కోసం భూములు ఇవ్వలేదనే కారణంతో మురికిపూడి ఆదిబాబుపై అధికార పార్టీ దాడి చేసిందని ఎస్సీ కమిషన్‌కు రైతులు తెలిపారు. ఎమ్మెల్యే రజనీ అండతోనే అధికార పార్టీ నేతలు తమపై దాడి చేశారని కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. అలాగే చిలకలూరిపేటలో దళితుల శ్మశానం కబ్జా చేశారని ఓ రైతు ఫిర్యాదు చేశారు. చిలకలూరిపేటలో దళితులకు ఇచ్చిన స్థలాలును కబ్జా చేశారని మరో రైతు ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. 



Updated Date - 2021-08-24T20:59:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising