ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వాళ్లు కూడా నా పిల్లలే... థర్టీ ఇయర్స్ పృథ్వీరాజ్

ABN, First Publish Date - 2021-07-29T22:19:35+05:30

వాళ్లు కూడా నా పిల్లలే... థర్టీ ఇయర్స్ పృథ్వీరాజ్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: హాస్యనటుడు, ఎస్వీబీసీ ఛానెల్ మాజీ చైర్మన్ పృథ్వీరాజ్ జిల్లాలో పర్యటించారు. కళ్యాణదుర్గం మండలం తిమ్మగానిపల్లిలో గొల్ల నారాయణ యాదవ్ (మిలటరీ నారాయణ) ఇటీవల మృతి చెందారు. దీంతో నారాయణ కుటుంబ సభ్యులను పృథ్వీరాజ్ పరామర్శించారు. మిలటరీ నారాయణకు భార్య లలిత, ఇద్దరూ కూతుళ్లు తేజస్విని, కూతురు దివ్య, కుమారుడు తరుణ్ కుమార్ ఉన్నారు. పెద్ద కూతురు తేజస్విని 2014 నుంచి ఫిలిమ్ ఇండస్ట్రీలో పనిచేస్తున్నారు. రెండవ కూతురు బ్రహ్మసముద్రం మండలం పడమటి కోడిపల్లి సచివాలయంలో సర్వేయర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. కొడుకు డిప్లొమో చేసి పెనుగొండ కియా పరిశ్రమలో ఉద్యోగి చేస్తున్నారు. తండ్రి మృతితో ప్రస్తుతం తరుణ్ ఇంటివద్దనే ఉంటున్నారు.


నారాయణ పెద్ద కుమార్తె తేజస్విని హైదరాబాద్‌లో పృథ్వీరాజ్ ఫ్యామిలీతో కలిసి ఉంటున్నారు. మిలటరీ నారాయణ అంత్యక్రియలకు వెళ్లలేకపోవడంతో పృథ్వీరాజ్ ఈ రోజు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి మనోధైర్యం కల్పించారు. నారాయణ పిల్లలు కూడా తన బిడ్డలతో సమానమన్నారు. నారాయణ పిల్లలు మంచి పొజిషన్‌కి వెళ్లేందుకు తన వంతు సాయం చేస్తానని పృథ్వీరాజ్ భరోసా ఇచ్చారు. అంతకుముందు నారాయణ సమాధి వద్ద సంతాపాన్ని తెలియజేశారు. 


Updated Date - 2021-07-29T22:19:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising