జగన్ సర్కార్పై నారా లోకేశ్ ఘాటు వ్యాఖ్యలు
ABN, First Publish Date - 2021-07-27T21:06:41+05:30
వైసీపీ ప్రభుత్వంలో అన్నీ ఆరచకాలేనన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్. నగరంలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన..
సామర్లకోట: వైసీపీ ప్రభుత్వంలో అన్నీ ఆరచకాలేనన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్. నగరంలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. పాదయాత్ర సమయంలో అన్నీ పెంచుకుంటూ పోతున్నారని ఎద్దేవా చేసిన జగన్.. ఇప్పుడు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. చెత్తపై పన్ను.. ఇంటి పన్నుతో ప్రజల నడ్డి విరుస్తున్నారని విమర్శించారు. విద్యుత్ చార్జీల మొదలు అన్నీ పెంచుకుంటూ పోతున్నారన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక వైసీపీకి వడ్డీతో సహా అన్ని చెల్లిస్తామన్నారు. అధికారం అడ్డు పెట్టుకుని తమను ఏం చేయలేరన్నారు. టీడీపీ కార్యకర్తల గడ్డం కాదు కదా వెంట్రుక కూడా పీకలేరని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Updated Date - 2021-07-27T21:06:41+05:30 IST