మైనార్టీ శాఖపై సీఎం జగన్ సమీక్ష
ABN, First Publish Date - 2021-08-09T23:25:38+05:30
మైనార్టీ శాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. వక్ఫ్ భూములపై పూర్తిస్థాయిలో
అమరావతి: మైనార్టీ శాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. వక్ఫ్ భూములపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. వక్ఫ్ భూముల చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మాణం చేపట్టాలని జగన్ సూచించారు. వైఎస్సార్ జగనన్న సమగ్ర భూ సర్వేతో పాటు వక్ఫ్ ఆస్తులను కూడా సర్వే చేయాలన్నారు. కర్నూలులో వక్ఫ్ ట్రైబ్యునల్ ఏర్పాటు దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
మైనార్టీలకు కొత్త స్మశాన వాటికలు ఏర్పాటు చేయాలన్నారు. ఇమామ్లు, మౌజంలు, పాస్టర్లకు సకాలంలో వేతనాల చెల్లింపులు జరగాలన్నారు. కర్నూలులో ఉర్దూ వర్సిటీ పనులను త్వరతిగతిన పూర్తి చేయాలన్నారు. షాదీఖానాల నిర్వహణను మైనార్టీ శాఖకు బదిలీ చేయాలన్నారు. హజ్ కమిటీలు, వక్ఫ్ కమిటీల ఏర్పాటును త్వరగా పూర్తిచేయాలన్నారు. గుంటూరులో అసంపూర్ణంగా నిలిచిపోయిన క్రిస్టియన్ భవన్ను పూర్తిచేయాలని అధికారులను జగన్ ఆదేశించారు.
Updated Date - 2021-08-09T23:25:38+05:30 IST