ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పనులేవీ ఆగకూడదు.. అధికారులకు జగన్ ఆదేశాలు

ABN, First Publish Date - 2021-05-05T23:08:28+05:30

పనులేవీ ఆగకూడదు.. అధికారులకు జగన్ ఆదేశాలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ‘నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు’‌పై సీఎం జగన్‌ సమీక్షించారు. జగనన్న కాలనీలలో వసతుల కల్పన, టిడ్కో ఇళ్ల నిర్మాణంపై ఈ సమీక్షలో జగన్ చర్చించారు. జగనన్న కాలనీల్లో జూన్‌ 1న పనులు ప్రారంభించాలని అధికారులకు జగన్ సూచించారు. ఈ నెల 25 నాటికి అన్ని ఏర్పాట్లు పూర్తి కావాలన్నారు. కర్ఫ్యూ సమయంలోనూ పనులేవీ ఆగకూడదని ఆదేశించారు. మధ్యాహ్నం 12 గంటల వరకు యథావిథిగా కార్యకలాపాలు కొనసాగాలన్నారు. నీటి సదుపాయాలు, విద్యుత్‌ సరఫరా వ్యవస్థ ఉండాలని, ఇళ్ల నిర్మాణ పనుల్లో ఎక్కడా జాప్యం ఉండకూడదని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.


ఈ సమీక్షలో అధికారులకు సీఎం జగన్ పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. కోవిడ్‌ సమయంలో ఇళ్ల నిర్మాణం ఆర్థిక వ్యవస్థకు వృద్ధి అని జగన్ తెలిపారు. ‘‘కార్మికులకు పని దొరుకుతుంది. స్టీల్, సిమెంట్‌, ఇతర మెటేరియల్‌ కొనుగోలుతో వ్యాపార లావాదేవీలు జరుగుతాయి. ఇళ్ల నిర్మాణంలో లెవెలింగ్‌ అన్నది చాలా ముఖ్యం. భవిష్యత్తులో అంతా భూగర్భ కేబుల్‌ వ్యవస్థనే. నీటి పైప్‌లు, విద్యుత్, ఇంటర్నెట్‌ కేబుళ్లన్నీ భూగర్భంలోనే. డీపీఆర్‌ సిద్ధం చేయండి. పనులన్నీ ఒకే ఏజెన్సీకి ఇవ్వండి.’’ అని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. 


Updated Date - 2021-05-05T23:08:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising