ఐఏఎస్ల నుంచి స్ఫూర్తి పొందాలి: సీఎం జగన్
ABN, First Publish Date - 2021-10-26T22:42:17+05:30
రాష్ట్రంలోని ఐఏఎస్లను ఆదర్శంగా తీసుకుని స్ఫూర్తి పొందాలని విద్యార్థులకు
అమరావతి: రాష్ట్రంలోని ఐఏఎస్లను ఆదర్శంగా తీసుకుని స్ఫూర్తి పొందాలని విద్యార్థులకు సీఎం జగన్ సూచించారు. ప్రభుత్వ ఎస్టీ, ఎస్సీ గురుకులాల్లో చదివి ఐఐటీ కాలేజీల్లో సీట్లు పొందిన ఐఐటీ ర్యాంకర్లకు సీఎం అభినందనలు తెలిపారు. విద్యార్థులకు ల్యాప్టాప్లను సీఎం జగన్ బహూకరించారు. ఐఏఎస్లుగా ఉన్న చాలామంది నేపథ్యాలు అత్యంత సాధారణమైనవేనని ఆయన అన్నారు. వారు కష్టపడి ఐఏఎస్ సాధించారన్నారు. వారి నుంచి కూడా స్ఫూర్తి పొంది కలెక్టర్ల స్థాయికి చేరుకోవాలని విద్యార్థులకు జగన్ సూచించారు. విద్యార్థులకు ఏం కావాలన్నా తగిన సహాయ సహకారాలు అందుతాయని సీఎం జగన్ హామీ ఇచ్చారు.
Updated Date - 2021-10-26T22:42:17+05:30 IST