ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యువతిపై పెట్రోలుతో దాడి ఘటనపై సీఎం ఆరా

ABN, First Publish Date - 2021-08-20T22:14:44+05:30

విజయనగరం జిల్లాలో యువతిపై పెట్రోలుతో దాడి ఘటనపై సీఎం జగన్ ఆరా తీశారు. మెరుగైన వైద్యం కోసం విశాఖ తరలించాలని సీఎం ఆదేశించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: విజయనగరం జిల్లాలో యువతిపై పెట్రోలుతో దాడి ఘటనపై సీఎం జగన్ ఆరా తీశారు. మెరుగైన వైద్యం కోసం విశాఖ తరలించాలని సీఎం ఆదేశించారు. ఘటనకు సంబంధించిన వివరాలను సీఎంకు అధికారులు వివరించారు. బాధితురాలి ఆరోగ్యం నిలకడగా ఉందని జగన్‌కు అధికారులు వివరించారు. బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించి అండగా నిలబడాలని మంత్రి బొత్స సత్యనారాయణకు సీఎం అదేశించారు. నిందితుడిపై కఠినచర్యలు తీసుకోవాలని జగన్ చెప్పారు. బాధితురాలిని మంత్రి బొత్స సహా డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి, అధికారులు పరామర్శించారు. యువతిపై పెట్రోల్ దాడి ఘటన దురదృష్టకరమని మంత్రులు పుష్ప శ్రీవాణి, బొత్స సత్యనారాయణ అన్నారు. తరచూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం బాధాకరమని చెప్పారు. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడన్నారు. దిశ యాప్ కారణంగానే బాధితులను సకాలంలో కాపాడగలిగామని తెలిపారు. యాప్ నుంచి సమాచారం వచ్చిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను రక్షించారని మంత్రులు చెప్పారు. 

Updated Date - 2021-08-20T22:14:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising