ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమర జవాన్ కుటుంబానికి రూ.50లక్షలు సాయం: సీఎం జగన్

ABN, First Publish Date - 2021-07-09T19:42:45+05:30

అమర జవాన్‌ జశ్వంత్‌రెడ్డికి సీఎం జగన్ నివాళులర్పించారు. బద్వేల్ సభలో మాట్లాడుతూ.. జశ్వంత్‌రెడ్డి కుటుంబాన్ని ఆదుకునేందుకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప: అమర జవాన్‌ జశ్వంత్‌రెడ్డికి సీఎం జగన్ నివాళులర్పించారు. బద్వేల్ సభలో మాట్లాడుతూ.. జశ్వంత్‌రెడ్డి కుటుంబాన్ని ఆదుకునేందుకు రూ.50 లక్షల ఆర్థికసాయం ప్రకటించారు. జశ్వంత్‌రెడ్డి సేవలు వెలకట్టలేనివని, ప్రాణాలు ఫణంగా పెట్టారని, ఆయన త్యాగం నిరుపమానమైనదన్నారు. జశ్వంత్‌రెడ్డి కుటుంబానికి తోడుగా నిలవాలని అధికారులను ఆదేశించారు. 


జమ్మూకశ్మీర్‌ ఎన్‌కౌంటర్‌లో గుంటూరు జిల్లాకు చెందిన జశ్వంత్ రెడ్డి మరణించిన విషయం తెలిసిందే. నిన్న రాజౌరి జిల్లా సుందర్‌బని సెక్టార్‌లో ఎదురు కాల్పులు జరిగాయి. ఇద్దరు ఉగ్రవాదులను భద్రతాదళాలు మట్టుబెట్టాయి. ముష్కరుల కాల్పుల్లో ఇద్దరు భారత జవాన్లు వీరమరణం పొందారు. బాపట్ల మండలం దరివాదకొత్తపాలెం వాసి మరుపోలు జశ్వంత్‌రెడ్డి (23) మృతి చెందారు. ఐదేళ్ల క్రితం జశ్వంత్‌రెడ్డి సైన్యంలో చేరారు. జశ్వంత్‌రెడ్డి మృతితో దరివాద కొత్తపాలెంలో విషాదచాయలు అలముకున్నాయి.

Updated Date - 2021-07-09T19:42:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising