దేవినేని ఉమాపై సీఐడీ కేసు
ABN, First Publish Date - 2021-04-11T09:25:51+05:30
మాజీ మంత్రి దేవినేని ఉమాపై కర్నూలు సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. సీఎం జగన్పై మార్ఫింగ్ చేసిన
కర్నూలు(లీగల్), ఏప్రిల్ 10: మాజీ మంత్రి దేవినేని ఉమాపై కర్నూలు సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. సీఎం జగన్పై మార్ఫింగ్ చేసిన వీడియోలను ప్రదర్శించి తప్పుడు ఆరోపణలు చేశారంటూ వైసీపీ లీగల్ సెల్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఇచ్చిన ఫిర్యాదుపై సీఐడీ స్పందించింది. ‘ఈ నెల 7న టీడీపీ నేత దేవినేని ఉమా తిరుపతిలో జరిగిన విలేకరుల సమావేశంలో సీఎం జగన్పై తప్పుడు ఆరోపణలు చేశారు. పాత వీడియోలను ప్రదర్శించారు’ అని ఫిర్యాదులో ఎన్.నారాయణ రెడ్డి పేర్కొన్నారు. దీంతో సీఐడీ పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Updated Date - 2021-04-11T09:25:51+05:30 IST