సైబర్ నేరస్తుల మనస్తత్వాన్ని చదవాలి
ABN, First Publish Date - 2021-06-22T09:11:40+05:30
ఎప్పటికప్పుడు కొత్త మార్గాల్లో ప్రజలను బురిడీ కొట్టిస్తున్న సైబర్ నేరగాళ్ల భరతం పట్టాలంటే.. సైబర్ నేరాలపై పట్టు సాధించాలని సీఐడీ అడిషనల్ డీజీ సునీల్ కుమార్ అన్నారు
సీఐడీ ఏడీజీ సునీల్ కుమార్
అమరావతి, జూన్ 21(ఆంధ్రజ్యోతి): ఎప్పటికప్పుడు కొత్త మార్గాల్లో ప్రజలను బురిడీ కొట్టిస్తున్న సైబర్ నేరగాళ్ల భరతం పట్టాలంటే.. సైబర్ నేరాలపై పట్టు సాధించాలని సీఐడీ అడిషనల్ డీజీ సునీల్ కుమార్ అన్నారు. సైబర్ నేరాలపై దర్యాప్తు అధికారులకు శిక్షణా కార్యక్రమం సోమవారం మంగళగిరిలోని రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ సైబర్ నేరగాళ్ల, జీవన విధానం, మానసిక పరిస్థితిని కూడా పోలీసులు ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ఉండాలని ఆయన సూచించారు.
Updated Date - 2021-06-22T09:11:40+05:30 IST