డోన్ పీఎస్లో కొట్టుకున్న సీఐ, న్యాయవాది
ABN, First Publish Date - 2021-09-07T23:22:13+05:30
జిల్లాలోని డోన్ పట్టణ పీఎస్లో సీఐ, న్యాయవాది పరస్పరం
కర్నూలు: జిల్లాలోని డోన్ పట్టణ పీఎస్లో సీఐ, న్యాయవాది పరస్పరం దాడి చేసుకున్నారు. తమ ఇంటి దగ్గర వివాదంతో పీఎస్కు ఇద్దరు న్యాయవాదులు వచ్చారు. సీఐకి తమ వివాదాన్ని వివరించే క్రమంలో సీఐ, న్యాయవాది మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆవేశంలో ఒకరిపై ఒకరు పరస్పరం దాడి చేసుకున్నారు. అనంతరం బయటికి వచ్చాక మరోసారి పోలీసులంతా కలసి అడ్వొకేట్పై దాడి చేసారు. అడ్వొకేట్పై పోలీసులు దాడిచేయడం పట్ల న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేసారు.
Updated Date - 2021-09-07T23:22:13+05:30 IST