తిరుమల నడక మార్గంలో హైదరాబాద్ యువకుడి మృతి
ABN, First Publish Date - 2021-02-28T08:35:59+05:30
తిరుమల వేంకటేశ్వర స్వామి దర్శనార్థం వచ్చిన ఓ హైదరాబాదు యువకుడు అలిపిరి నడక మార్గంలో హఠాన్మరణం పాలయ్యాడు
తిరుమల, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): తిరుమల వేంకటేశ్వర స్వామి దర్శనార్థం వచ్చిన ఓ హైదరాబాదు యువకుడు అలిపిరి నడక మార్గంలో హఠాన్మరణం పాలయ్యాడు.విజిలెన్స్ అధికారుల కథనం మేరకు.. హైదరాబాద్కు చెందిన బీటెక్ విద్యార్థి రాహుల్(23) శ్రీవారి దర్శనం కోసం శనివారం ఉదయం తిరుపతికి చేరుకున్నాడు. మొక్కు తీర్చుకునే క్రమంలో స్నేహితులతో కలిసి అలిపిరి నుంచి తిరుమల కొండకు నడక ప్రారంభించాడు.గాలిగోపురం వద్ద గుండెనొప్పితో రాహుల్ కుప్పకూలిపోయారు. గుర్తించిన స్నేహితులు వెంటనే అంబులెన్స్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఈ మేరకు రాహుల్ను పరిశీలించిన వైద్య సిబ్బంది అప్పటికే మృతి చెందినట్టు నిర్థారించారు.మృతదేహాన్ని తిరుమలలోని అశ్విని ఆస్పత్రికి తరలించి కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు.
Updated Date - 2021-02-28T08:35:59+05:30 IST