ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బెట్టింగులకు యువకుడు బలి

ABN, First Publish Date - 2021-02-28T06:46:34+05:30

బెట్టింగులతో ఓ ఇంజినీరింగ్‌ విద్యార్థి ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు.

రాజ్‌ కిరణ్‌ మృతదేహం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉరివేసుకుని ఆత్మహత్య

కుప్పం/కుప్పం రూరల్‌, ఫిబ్రవరి 27: బెట్టింగులతో ఓ ఇంజినీరింగ్‌ విద్యార్థి ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. శాంతిపురం మండలం రాళ్లబూదుగూరు గ్రామానికి చెందిన కుప్పం వ్యవసాయ మార్కెట్టు కమిటీ మాజీ డైరెక్టర్‌ బసవరాజు కుమారుడు బి.రాజ్‌ కిరణ్‌ కుప్పంలోని ఓ కళాశాలలో ఇంజినీరింగ్‌ మూడో సంవత్సరం చదువుతున్నాడు. శనివారం ఉదయం కళాశాలకు వెళ్లొస్తానంటూ యథావిధిగా ఇంటినుంచి బయలుదేరాడు. అనంతరం కళాశాల సమీపంలోని ఓ చెట్టుకు ఉరివేసుకున్నాడు. అతడు సామాజిక మాధ్యమాలలో చేసిన పోస్టింగులను బట్టి, బెట్టింగుల అలవాటుతోనే ఇలా చేసుకున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ‘ప్లీజ్‌ మరోసారి చెబుతున్నా. బెట్టింగులకు వెళ్లకండి.. నాలాగా మీ జీవితాలను నాశనం చేసుకోకండి.’ అని ఆంగ్లంలో ఉన్న పోస్టింగ్‌ అతని ఇన్‌స్టాగ్రాంలో కనిపించింది. అయితే అతనికి బెట్టింగులు అలవాటు లేవని కుటుంబ సభ్యులు అంటున్నారు.  ఎస్‌ఐ నరేంద్రను వివరణ కోరగా సెమిస్టర్‌ పరీక్షల్లో ఫెయిల్‌ కావడం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుని తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కుప్పం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Updated Date - 2021-02-28T06:46:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising