ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అభివృద్ధి పనుల్లో వైసీపీ స్టీరింగ్‌ కమిటీ పెత్తనం!

ABN, First Publish Date - 2021-01-20T06:38:59+05:30

ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు అధికార పార్టీ సమావేశాలకూ అధికారులు హాజరయ్యే కాలమొచ్చింది.వరదయ్యపాళెం ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం వైసీపీ మండల స్టీరింగ్‌ కమిటీ సమీక్ష పేరిట ఓ సమావేశం జరిగింది.

ఎంపీడీవోతో వాగ్వాదం చేస్తున్న వైసీపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అధికార పార్టీలో విభేదాలతో బయటపడ్డ వైనం


వరదయ్యపాళెం, జనవరి 19:ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు అధికార పార్టీ సమావేశాలకూ అధికారులు హాజరయ్యే కాలమొచ్చింది.వరదయ్యపాళెం ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం వైసీపీ మండల స్టీరింగ్‌ కమిటీ సమీక్ష పేరిట ఓ సమావేశం జరిగింది. అభివృద్ధి పనులతో పాటు 14వ ఆర్థిక సంఘ నిఽధుల వినియోగం వంటి అంశాలపై కమిటీ భాగస్వామిగా వ్యవహరిస్తుందని ఆ కమిటీ సభ్యుడు దామోదరరెడ్డి అన్నారు. స్టీరింగ్‌ కమిటీ సలహలను, సూచనలను అధికారులు  పరిగణనలోకి తీసుకోవాలన్నారు.ఎంపీడీవో సుబ్రహ్మణ్యంరాజు, ఈవోపీఆర్డీ శ్రీనివాస్‌, పీఆర్‌ఏఈ తదితరులు పాల్గొన్నారు.ఈ సమాచారం తెలుసుకున్న మరో వర్గం వైసీపీ నాయకులు హుటాహుటిన ఎంపీడీవో కార్యాలయం వద్దకు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు.ఒక వర్గం నాయకులు అనఽధికారికంగా ఏర్పాటు చేసిన సమావేశాలకు మండలస్థాయి అధికారులు హాజరు కావడం ఏంటని  బీసీసెల్‌ అధ్యక్షుడు వీరభద్రం,సేవాదళ్‌ అధ్యక్షుడు శివ,యువత ప్రధాన కార్యదర్శి సాయిరెడ్డి   ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఎంపీడీవోతో వాగ్వాదానికి దిగారు.వైసీపీ నాయకులు కోరడంతోనే సమావేశంలో పాల్గొన్నట్లు ఎంపీడీవో చెప్పారు.

Updated Date - 2021-01-20T06:38:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising