ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిరుత దాడిలో భార్యాభర్తలకు గాయాలు

ABN, First Publish Date - 2021-07-26T06:44:13+05:30

చిరుత దాడిలో వడమాలపేట మండలం లక్ష్మీపురానికి చెందిన సుబ్రహ్మణ్యంనాయుడు, మంజుల దంపతులు గాయపడ్డారు.

చికిత్స పొందుతున్న సుబ్రహ్మణ్యంనాయుడు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సింగిరికోనలో కలకలం 

 వడమాలపేట, జూలై 25: చిరుత దాడిలో వడమాలపేట మండలం లక్ష్మీపురానికి చెందిన సుబ్రహ్మణ్యంనాయుడు, మంజుల దంపతులు గాయపడ్డారు. నారాయణవనం మండలం సింగిరికోనలో లక్ష్మీనరసింహస్వామి దర్శనార్థం వీరు ఆదివారం ఉదయం ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. సింగిరికోన సమీపానికి వెళ్లగానే వీరిపై చిరుతపులి దాడికి పాల్పడింది. మొదటగా మంజులపై దూకడంతో ద్విచక్ర వాహనం అదుపు తప్పింది. పరిసరాల్లో జనసంచారం లేకపోవడంతో ఇద్దరూ పెనుగులాడారు. సుబ్రహ్మణ్యంనాయుడు ధైర్యంగా అరుస్తూ రాళ్లతో కొట్డడంతో అదృష్టవశాత్తు చిరుత పారిపోయింది. తీవ్రగాయాలతో వీరిద్దరూ కోనకు చేరుకుని ఈ ఘటన గురించి గుడి నిర్వాహకులకు తెలిపారు. వారు వాహనంలో పుత్తూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మంజుల తలకు. సుబ్రహ్మణ్యం కుడికాలుకు గాయాలయ్యాయి. కాగా, మధ్యాహ్నం 12గంటల ప్రాంతంలో నగరికి చెందిన భక్తులు మోటారు సైకిల్‌పై వెళ్తుండగా చిరుత దాడికి పాల్పడినట్లు తెలిసింది. ఈ ఘటనలతో కలకలం రేగింది. 

Updated Date - 2021-07-26T06:44:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising