4న ఉప రాష్ట్రపతి పర్యటన
ABN, First Publish Date - 2021-03-03T06:25:51+05:30
ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఈనెల 4వతేదీ ఏర్పేడు సమీపంలోని తిరుపతి ఐఐటీకి విచ్చేయనున్నారు.
ఏర్పేడు, మార్చి 2: ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఈనెల 4వతేదీ తిరుపతి ఐఐటీకి విచ్చేయనున్నారు. ఆ మేరకు ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ హరినారాయణన్ ఆదేశించారు. మంగళవారం ఆయన అధికారులతో కలసి ఏర్పేడు ఐఐటీ ప్రాంగణాన్ని పరిశీలించి, సంబంధిత డైరెక్టర్ సత్యనారాయణతో ఏర్పాట్లపై చర్చించారు. కాగా, గురువారం ఉదయం 9.55 గంటలకు ఉపరాష్ట్రపతి రేణిగుంట విమానాశ్రయానికి వస్తారన్నారు. అక్కడ నుంచి 10.15 గంటలకు ఏర్పేడు ఐఐటీకి చేరుకుంటారని తెలిపారు. అక్కడి నుంచి 11.20 గంటలకు కరకంబాడి మార్గంలోని అమర ఆస్పత్రిలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు. కార్యక్రమంలో తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు, ఆర్డీవో కనకనరసారెడ్డి, డీఎస్పీ రామచంద్ర తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-03-03T06:25:51+05:30 IST