ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మరో ఏడాదిపాటు ఎంపీడీవోలకు వాహన అలవెన్సు

ABN, First Publish Date - 2021-05-06T05:39:13+05:30

జిల్లాలోని ఎంపీడీవోలకు మరో ఏడాదిపాటు వాహన అలవెన్సులు చెల్లించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలికిరి, మే 5: జిల్లాలోని ఎంపీడీవోలకు మరో ఏడాదిపాటు వాహన అలవెన్సులు చెల్లించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఎంపీడీవోలు, తహసీల్దార్లకు నెలకు రూ.35 వేల వంతున వాహన అలవెన్సును ప్రభుత్వం చెల్లిస్తోంది. మండలాల్లో జరిగే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు అద్దె వాహనాలను ఏర్పాటు చేసుకునేందుకు వీరిని అనుమతిచ్చింది. దీని కోసం ప్రతి నెలా ఎంపీడీవోలు, తహసీల్దార్లకు రూ.35 వేలతో అద్దె వాహనాలను సమకూర్చుకోవచ్చు. అయితే ఎంపీడీవోలకు సంబంధించిన బడ్జెట్‌ కేటాయింపులు గత ఆఽర్థిక సంవత్సరం వరకే పరిమితం కావడంతో ఎంపీడీవోల రాష్ట్ర సంఘం ఈ ఏడాది నిధుల కేటాయింపునకు ప్రభుత్వానికి విన్నవించింది. నడుస్తున్న ఆర్థిక సంవత్సరానికి కేటాయింపులు చేయాల్సిందిగా పంచాయతీ రాజ్‌ కమిషనరు ప్రభుత్వానికి సిఫారసు చేశారు. దీంతో జిల్లాలోని 65 మంది ఎంపీడీవోలకు లబ్ధి చేకూరే విధంగా ప్రస్తుత సంవత్సరానికి నిధులు మంజూరు చేస్తూ ఆ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది బుధవారం ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ఆర్థిక శాఖ కూడా ఈ నిధుల విడుదలకు అనుమతించింది. 

Updated Date - 2021-05-06T05:39:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising