ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైలు కింద పడి గుర్తు తెలియని యువతి ఆత్మహత్య?

ABN, First Publish Date - 2021-05-14T04:49:44+05:30

కలికిరికి కిలోమీటరు దూరంలో పీలేరు మార్గంలో రైలు కింద పడి గుర్తు తెలియని ఒక యువతి ఆత్మహత్యకు పాల్పడింది.

పట్టాలపై పడి ఉన్న మృతదేహం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలికిరి, మే 13: కలికిరికి కిలోమీటరు దూరంలో పీలేరు మార్గంలో రైలు కింద పడి గుర్తు తెలియని ఒక యువతి ఆత్మహత్యకు పాల్పడింది. గురువారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో పాకాల నుంచి ధర్మవరం వైపు వెళుతున్న కోచింగ్‌ ప్రత్యేక రైలుకు చెందిన సహాయ లోకో పైలట్‌ ఈ సమాచారాన్ని కలికిరి స్టేషన్‌ మాస్టర్‌ కరుణాకర్‌కు తెలియజేశారు. ఆయన వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం అందజేశారు. కదిరి నుంచి వచ్చిన రైల్వే పోలీసు హెడ్‌ కానిస్టేబుల్‌ వై.సల్మాన్‌ మృత దేహాన్ని పరిశీలించారు. మృతురాలి వయసు 25-30 ఏళ్ల మధ్య ఉంటుందని సల్మాన్‌ పేర్కొన్నారు. ఈ మేరకు కదిరి రైల్వే పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేసుకుని శవ పరీక్ష కోసం యువతి మృత దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.  

Updated Date - 2021-05-14T04:49:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising