ఏడుగురు ఎస్ఐల బదిలీ
ABN, First Publish Date - 2021-05-18T06:15:38+05:30
వివిధ పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న ఏడుగురు ఎస్ఐలను బదిలీ చేస్తూ సోమవారం ఎస్పీ సెంథిల్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
చిత్తూరు, మే 17: వివిధ పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న ఏడుగురు ఎస్ఐలను బదిలీ చేస్తూ సోమవారం ఎస్పీ సెంథిల్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. కేవీబీపురం ఎస్ఐగా పనిచేస్తున్న డి.గోపిని వెదురుకుప్పం పోలీస్స్టేషన్కు బదిలీ చేశారు. అలాగే నగరి అర్బన్లోని కె.దస్తగిరిని కార్వేటినగరానికి, కుప్పం అర్బన్లోని కె.నరేంద్రను పెనుమూరుకు, వెదురుకుప్పంలోని సి.లోకేష్రెడ్డిని కలికిరికి బదిలీ చేయగా, కార్వేటినగరంలోని ఎం.మనోహర్ను, పెనుమూరులోని ఎన్.ప్రవీణ్కుమార్ను, కలికిరిలోని చంద్రమోహన్లను వీఆర్కు పంపారు.
Updated Date - 2021-05-18T06:15:38+05:30 IST