ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉపరాష్ట్రపతి పర్యటన సందర్భంగా తిరుపతిలో ట్రాఫిక్‌ మళ్లింపులు

ABN, First Publish Date - 2021-03-04T07:44:56+05:30

భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు గురువారం తిరుపతి పర్యటనకు రానున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి(నేరవిభాగం), మార్చి 3: భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు గురువారం తిరుపతి పర్యటనకు రానున్నారు. ఈ సందర్భంగా నగరంలోని వివిధ మార్గాల్లో ట్రాఫిక్‌ నియంత్రణలు ఉంటాయని ట్రాఫిక్‌ డీఎస్పీ మల్లికార్జున వెల్లడించారు. 4వ తేదీ సాయంత్రం 3 గంటల నుంచి 6 గంటల వరకు ఈ నియంత్రణలు ఉంటాయని వివరించారు. కరకంబాడి నుంచి అలిపిరి గరుడ కూడలి వరకు ట్రాఫిక్‌ నియంత్రణ ఉంటుందని, తిరుమల నుంచి వచ్చే వాహనాలు గరుడ సర్కిల్‌ నుంచి రుయా, మెటర్నిటీ టౌన్‌క్లబ్‌ మీదుగా ఆర్టీసీ బస్టాండుకు చేరాల్సి ఉంటుంది. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్‌ నుంచి తిరుమలకు వెళ్లాల్సిన వాహనాలు టీఎంఆర్‌ కళ్యాణమండపం, మున్సిపల్‌ కార్యాలయం, వీవీ మహల్‌, అన్నారావు కూడలి, ఇస్కాన్‌ మీదుగా అలిపిరికి చేరాల్సి ఉంటుంది. ఇక కరకంబాడి నుంచి లీలామహల్‌ కూడలివైపుకు రావాల్సిన వాహనాలను రేణిగుంట మీదుగా నగరంలోకి రావాల్సి ఉంటుంది. ఉపరాష్ట్రపతి పర్యటన నిమిత్తం చేస్తున్న ఈ మార్పులను గమనించి ప్రజలు సహకరించాలని డీఎస్పీ విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2021-03-04T07:44:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising