ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ట్రాక్టర్‌ బోల్తా : యజమాని మృతి

ABN, First Publish Date - 2021-10-19T06:08:44+05:30

పీలేరు మండలం రేగళ్లు పంచాయతీ బోయపల్లె సమీపంలోని బోడిగుట్ట వద్ద ట్రాక్టర్‌ అదుపు తప్పి బోల్తాపడిన ఘటనలో ఓ రైతు మృతి చెందాడు.

బోల్తాపడిన ట్రాక్టర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పీలేరు, అక్టోబరు 18: పీలేరు మండలం రేగళ్లు పంచాయతీ బోయపల్లె సమీపంలోని బోడిగుట్ట వద్ద  ట్రాక్టర్‌ అదుపు తప్పి బోల్తాపడిన ఘటనలో ఓ రైతు మృతి చెందాడు. బోయపల్లెకి చెందిన రైతు బాలరాజు (46) రెండు వారాల క్రితం ఒక ట్రాక్టర్‌ను కొనుగోలు చేశాడు. గ్రామంలోని తన బంధువు అయిన రవి పొలం నుంచి వేరుశెనగ చెట్లను తరలించడానికి సోమవారం వెళుతుండగా మార్గమధ్యంలోని బోడిగుట్ట వద్ద ట్రాక్టర్‌ అదుపు తప్పి బోల్తాపడింది. ట్రాక్టర్‌ ఇంజను రైతు బాలరాజు మీద పడడంతో అక్కడికక్కడే చనిపోయాడు. గ్రామస్తులు వెంటనే ఎక్స్‌కవేటర్‌తో ట్రాక్టర్‌ను తొలగించి మృతదేహాన్ని వెలుపలికి తీశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఎస్‌ఐ తిప్పేస్వామి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

Updated Date - 2021-10-19T06:08:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising